నేటినుండి శంషాబాద్ ముచ్చింతల్ లో సమతా కుంభ్ 2023 ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
శంషాబాద్, రంగారెడ్డి, ముద్ర: శంషాబాద్ ముచ్చింతల శ్రీ రామ నగరంలో గురువారం నుండి సమత కూంబ్ 2023 ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యవి నేటి నుండి 10 రోజుల పాటు రామానుజాచార్య-108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలకోసం వైభవంగా ముస్తాబైన సమతా మూర్తి కేంద్రం సువర్ణమూర్తి భగవద్రామానుజుల వారికి ఉత్సవారం భన్నపనంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న సమతా మూర్తి కేంద్రం విశ్వక్సేన వీధీ శోధన, ఆరాధన -బ్రహ్మోత్సవాలకు ముందు విఘ్న నివారణ కోసం విష్వక్సేన పూజ నిర్వహిస్తారు అనంతరం శ్రీమన్నారాయణుడి సేనాథిపతిగా..బ్రహ్మత్సవాలకు ఎలాంటి ఆంటకాలు రాకుండా చూస్తారు విష్వక్సేనులు.
ఉత్సవాలకు ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూడ్డమే విష్వక్సేనులవారి విధి. ఉత్సవాలను పర్యవేక్షిస్తూ ఘనంగా నిర్వహిస్తారు ఈ యొక్క పది రోజుల ఉత్సవాలకు శంషాబాద్ మండల పరిధిలో కాక రంగారెడ్డి జిల్లా ప్రాంతాల నుండి భారీగా ప్రజలు చేరుకుని శ్రీ రామానుజ మొదటి వార్షికోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.