పాఠశాలలు , ఇంటర్ కళాశాలల బంద్ విజయవంతం

పాఠశాలలు , ఇంటర్ కళాశాలల బంద్ విజయవంతం

  •  వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యకార్య  చరణ కమిటీ

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యకార్యచరణ కమిటీ  రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు , ఇంటర్ కళాశాలల  బంద్  పిలుపును  జరిగింది. అందులో  భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయడం జరిగింది.ఈ సందర్భంగా PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్ ,SFI రాష్ట్ర సహాయ కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్ వర్మ, AISF  జిల్లా అధ్యక్షుడు గోపగాని రవి కుమార్ ,PDSU జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు న్యాయమైన విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ మరోవైపు ప్రైవేటు, కార్పోరేట్ విద్యా రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు..లక్షల రూపాయల ఫీజులు దోపిడీ ప్రవేటు ,కార్పోరేట్ పాఠశాల లో  జరుగుతున్నా ఫీజులను దోపిడిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ,విద్యార్థులకు ఉచితంగా బస్  పాస్ ఇవ్వాలిసి ఉండగా  150 రూపాయలు ఉన్న బస్ పాస్ చార్జీలను 400 పెంచడం వల్ల విద్యార్థులకు పెనుబారంగా పడిందని దీనివల్ల అనేక పేద బడుగు పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని చదువును మధ్యలోనే వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థులందరికీ ఉచితంగా బస్  పాసులు ఇచ్చి ప్రతి గ్రామానికి విద్యార్థుల సమయ అనుకూలంగా బస్సులను నడపాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేస్తున్నామన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి, పాఠ్యపుస్తకాలను ,యూనిఫా లను తక్షణమే అందించాలని, మన ఊరు మనబడి కార్యక్రమానికి నిధుల కొరత లేకుండా చూసి తక్షణమే 7000 కోట్ల రూపాయలను విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల అన్నిటికీ మన ఊరు మనబడి కార్యక్రమా లను వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్ విడుదల  చేసి , పర్యవేక్షణ అధికారులైన డీఈవో, డిప్యూటీ డీఈఓ  , ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు.పాఠశాలల అభివృద్ధి మౌలిక వసతుల కల్పన నియామకాల బడ్జెట్లో సంబంధించి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని గుర్తు చేశారు.  తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయించి ,ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రైవేటు ,కార్పోరేట్ ఫీజుల దోపిడిని అరికట్టి అనుమతులు లేకుండా నడిపిస్తున్నటువంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకొని ,ఖాళీగా ఉన్న ప్రభుత్వ  ఉపాధ్యాయ పోస్టులు, డిఈఓ, డిప్యూటీ డీ ఈ ఓ ,ఎం ఈ ఓ పోస్టులను భర్తీ చేసి ,విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్ లు  ఇచ్చి, హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ చార్జీలను  పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు.ఈ బంద్  లో PDSU,  దుదిపాల ప్రవీణ్, మేడిపల్లి ఉపేందర్, జేజిరాల సాయి, పవన్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బానోత్ వినోద్ కుమార్, తాళ్ల వినయ్,ఉజ్వల్, తరుణ్, బత్తుల వినయ్, గోపి అజయ్,AISF గడ్డం నాగరాజు ,నందారపు వేణు ,కొనపర్తి యశ్వంత్,ఉప్పుల అఖిల్,కాసర్ల వంశీ,నగరికంటి గోపీచంద్,గంగరబోయిన వీరబాబు తదితరులు పాల్గొన్నారు.