ఒంటిపై కిరోసిన్ పోసుకుని వృద్ధురాలు ఆత్మహత్య

ఒంటిపై కిరోసిన్ పోసుకుని వృద్ధురాలు ఆత్మహత్య

హుజూర్ నగర్ ,ముద్ర:పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన గణపువరపు పిచ్చమ్మ(90) అనే వృద్ధురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈనెల 5న తెల్లవారుజామున ఆమె నివాసంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య కు పాల్పడగా హుజూర్నగర్  ఏరియా ఆసుపత్రిలో పిచ్చమ్మ మృతి చెందినట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. కాగా ఆమె భర్త మూడేళ్ల క్రితంమే చనిపోగా ఆమెకు పిల్లలు లేక, మానసిక స్థితి సరిగా లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.