క్రైస్తవులు రూ.లక్ష 100% సబ్సిడీ లోన్స్ ఆర్ధిక సహాయం కొరకు అప్లై చేసుకోవాలి - బిషప్ దుర్గం ప్రభాకర్

క్రైస్తవులు రూ.లక్ష 100% సబ్సిడీ లోన్స్ ఆర్ధిక సహాయం కొరకు అప్లై చేసుకోవాలి - బిషప్ దుర్గం ప్రభాకర్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: బేతెస్థ ప్రార్ధన మందిరం ఖాసీంపేట,4వ వార్డులో సూర్యాపేట బిషప్ దుర్గం ప్రభాకర్ సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శనివారం మాట్లాడుతూ అర్హులు అయినా క్రైస్తవులు , ముస్లిం, సిఖులు, జైనులు, బౌద్దులు,పార్షికులకు రాష్టం లోని మైనారిటీ సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం గా సియం కేసీఆర్ బిసి లకు అందింస్తున్న తరహాలోనే మైనారిటీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకానామిక్ సపోర్ట్ క్రింద ఏదైనా ఒక యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా వందశాతం సబ్సిడీ తో రూ. లక్ష ఆర్ధిక సహాయం చేస్తుందని చెప్పారు .ఈ స్కీమ్ కు ఈ నేల 31 నుండి ఆగస్టు 14తేది వరకు www.tsobmms.gov. in పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలని, క్రైస్తవులు బి.సి-సి సర్టిఫికెట్ కలిగిన వారు, బాప్తిస్మము సర్టిఫికెట్  ఇన్కం సర్టిఫికెట్ , రేషన్ కార్డు తో అప్లై చేసుకోవచ్చు అనీ అన్నారు.