పండుగ వేళ రాష్ట్ర పోలీస్ శాఖలో విషాదం నెలకొంది

పండుగ వేళ రాష్ట్ర పోలీస్ శాఖలో విషాదం నెలకొంది

ముద్ర,తెలంగాణ:- సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన హుటాహుటిన నగరంలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆయన మృతి చెందారు. కాగా, 1991వ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్.. ప్రస్తుతం తెలంగాణ విజిలెన్స్ డీజీగా పని చేస్తున్నారు. రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.