మహాశివరాత్రి సందర్భంగా బియ్యపు గింజ రంధ్రంలో శివయ్య రూపం
ముద్ర ప్రతినిధి,జగిత్యాల: హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివ నామస్మరణ చేస్తూ శివరాత్రి వేడుకలు జరుపుకునే సందర్భంగా.....జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డాక్టరేట్ గ్రహీత, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు డా.గుర్రం దయాకర్ బియ్యపు గింజలో శివుని విగ్రహాన్ని , పచ్చని పూల మొక్కలు రూపొందించాడు.
శివయ్య విగ్రహ తయారీకి గుండు పిన్ను, బియ్యపు గింజ, నైలాన్ కలర్స్ పెన్సిల్ వాడి అద్భుతమైన శివయ్య రూపాన్ని 18 గంటల సమయం తీసుకొని తయారు చేసినట్లు దయాకర్ తెలిపారు.ఈ సందర్భంగా దయాకర్ ను పలువురు అభినందించారు.