వైభవంగా సీతారాముల కళ్యాణం

వైభవంగా సీతారాముల కళ్యాణం

పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందించిన మంత్రి
 ముద్ర ప్రతినిధి,  వనపర్తి : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం వనపర్తి జిల్లాలోని పాలు ఆలయాల్లో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంకటేశ్వర ఆలయంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి కుటుంబ సభ్యులతో హాజరై పట్టు వస్త్రాలను సమర్పించారు.

జిల్లాలో జరిగిన అనేక దేవాలయాలకు కళ్యాణం సందర్భంగా ముత్యాల తలంబ్రాలను నేతల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో పాటు ఆయన సతీమణి వాసంతి, కూతురు, ఆయా వార్డులోని ఆలయాల్లో వార్డు కౌన్సిలర్లు, గ్రామాల్లో సర్పంచులు పార్టీల నాయకులు పాల్గొన్నారు.