తాసిల్దార్ కార్యాలయంలో ఘనంగా శ్రీపాదరావు జయంతి

తాసిల్దార్ కార్యాలయంలో ఘనంగా శ్రీపాదరావు జయంతి

ముద్రవీపనగండ్ల:- మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు 83వ జయంతి వేడుకలను కార్యాలయ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి తాసిల్దార్ వరలక్ష్మి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో స్పీకర్ గా వ్యవహరించారని, ఆయన చేసిన సేవలు గురించి స్మరించుకున్నారు. కార్యక్రమంలో నాయబ్ తాసిల్దార్ కృష్ణమూర్తి, గిర్ధవర్ కురుమూర్తి, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మి, కంప్యూటర్ ఆపరేటర్లు దశరథం, రాము, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.