జూలపల్లి లో శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ 

జూలపల్లి లో శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ 

ముద్ర రామగిరి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి సందర్భంగా కమాన్ పూర్ మండలం లోని జూలపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పదో తరగతి పిల్లలకు పరీక్ష పాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి గ్రామ ఎంపిటిసి చెవ్వ శంకరయ్య, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు రాజ్ కుమార్ రెబెల్, చొప్పరి సంతోష్, పడల మారుతి తదితరులు పాల్గొన్నారు.