అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వచ్ఛ తీర్ద్

అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వచ్ఛ తీర్ద్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అయోధ్య రామ మందిరం ప్రతిష్ట సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ  పిలుపుమేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో బిజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ తీర్ద్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డా. బోగ శ్రావణి ప్రవీణ్ దేవాలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతూ ఈనెల 22న జరిగే అయోధ్య బాలరాముడు విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవ సందర్భంగా  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పిలుపుమేరకు స్వచ్ఛత అభ్యాన్ కార్యక్రమంలో భాగంగా మన ప్రాంతంలోని ఆలయాలను శుభ్రపరచుకొని 22న ఒక పండగ వాతావరణంలా మలుచుకొని ఆరోజు ప్రతి ఇంటిలోనూ, దేవాలయాల్లో దీప ప్రమిదలను వెలిగించి శ్రీరామ నామ జపం చేయాలని ప్రజలను కోరారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిళ్ల సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, జిల్లా కార్యదర్శి బొడ్డు పెద్ద గంగారం, జగిత్యాల రూరల్ మండలాధ్యక్షుడు నలువాల తిరుపతి, జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, పట్టణ ఉపాధ్యక్షుడు పవన్ సింగ్, గాదసు రాజేందర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇట్నేని రమేష్, పట్టణ మహిళా మోర్చా నాయకులు, అభయాంజనేయ స్వామి దేవాలయం ట్రస్టు సభ్యులు, పట్టణ, జిల్లా పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.