తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌.. బాలిక‌ల‌దే పైచేయి

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌.. బాలిక‌ల‌దే పైచేయి

ముద్ర,తెలంగాణ:- తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుద‌ల‌య్యాయి. మంగ‌ళ‌వారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప‌ది ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. టెన్త్ ఫ‌లితాల్లో 91.31 ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది. బాలిక‌లు 93.23 శాతం ఉత్తీర్ణ‌త‌, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. 3,927 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, ఆరు స్కూల్స్‌లో జీరో ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది. గ‌తేడాది 89.60 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా 4,91,862 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.