ఆ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి?: కేంద్రం

ఆ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి?: కేంద్రం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  గత ఏడాది జనవరిలో పంజాబ్‌  పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపాల  అంశం మరోసారి తెరపైకి వచ్చింది.  భద్రతా వైఫల్యాలకు కారణమైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని తాజాగా పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. అధికారులపై చర్యల నివేదకను తమకు అందజేయాలని కోరింది. పంజాబ్ ఘటనపై విచారణకు గతంలో ఒక కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. పంజాబ్ పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారుల తప్పిదాల వల్లే సమస్య తలెత్తినట్టి కమిటీ నిర్ధారించింది. ఆ నివేదిక ఆధారంగా అధికారులపై ఇంతవరకూ తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదకను తమకు అందజేయాలని పంజాబ్ సర్కార్‌ను కేంద్రం తాజాగా ఆదేశించింది.