పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యం

పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యం

ఆలేరు మున్సిపల్ చైర్మన్ శంకరయ్య.....
ఆలేరు (ముద్ర న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రామపంచాయతీ పాలకవర్గం పనిచేస్తుందని ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. శుక్రవారం నాడు పురపాలక సంఘ కార్యాలయంలో  వస్పరి శంకరయ్య చైర్మన్ అధ్యక్షతన  జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఆయన మున్సిపల్ కమిషనర్ పి చక్రపాణి తో కలిసి పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ పాలకవర్గం నిరంతరం నూతన వరవడిలో పనిచేస్తుందని చెప్పారు. 

పట్టణ అభివృద్ధి కోసం పట్టణ ప్రజలు రాజకీయాలకు అతీతంగా తమ సూచనలు. సలహాలు పాలకవర్గం మరియు అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇటీవల కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల వలన పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయంలో మాత్రమే బయటికి రావాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ మోరిగాడి మాధవి వెంకటేష్ గౌడ్. మున్సిపల్ కౌన్సిలర్లు చింతలపని సునీత శ్రీనివాస్ రెడ్డి. ఎర్ర దయామని దేవదానం. భేతి రాములు. గుప్త శమంత సీతారాం రెడ్డి. సంగు భూపతి. రాయపురం నరసింహులు. మోర్తాల సునీత రమణారెడ్డి. దాసి నాగలక్ష్మి సంతోష్. కందుల శ్రీకాంత్. జూకంటి శ్రీకాంత్ తో పాటు ఆప్షన్ సభ్యులు. మున్సిపల్ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.