అదనపు కలెక్టర్లను కలిసిన టీఎన్జీవో సంఘం    

అదనపు కలెక్టర్లను కలిసిన టీఎన్జీవో సంఘం    

                    
ముద్ర ప్రతినిధి, మెదక్:నూతన అదనపు పాలన అధికారి (రెవెన్యూ) గా బాధ్యతలు చేపట్టిన  వెంకటేశ్వర్లును టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. బదిలీపై వెళ్తున్న అదనపు పాలన అధికారి రమేష్ ను సైతం కలిశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ  జిల్లా ఉద్యోగులు ఇదివరకులాగే  ప్రభుత్వ సుపరిపాలనలో ఉన్నతాధికారులకు సహకరిస్తూ మెదక్ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములమవుతామని తెలియజేశారు. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్ తో పాటు జిల్లా కార్యదర్శి మినికి రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు యండి. ఇక్బాల్ పాషా, ఎండి ఫజూలుద్దీన్, పంచాయతీ సెక్రెటరీల ఫోరం జిల్లా అధ్యక్షులు జంగం నగేష్ ఉన్నారు.