తల్లి విజయాన్ని కాంక్షిస్తూ కుమార్తె విస్తృత ప్రచారం

తల్లి విజయాన్ని కాంక్షిస్తూ కుమార్తె విస్తృత ప్రచారం

తుర్కపల్లి, ముద్ర : తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో తల్లి విజయాన్ని కాంక్షిస్తూ కుమార్తె గొంగిడి హర్షిత రెడ్డి విస్తృత ప్రచారాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు అందుతున్నాయని అన్నారు. రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ తోటే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.

ముచ్చటగా మూడవసారి ఆలేరు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రతి ఇంటింటికి బిఆర్ఎస్ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ ధనావత్ బిక్కు నాయక్, ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు తేజస్వి నిఖిల్, మాదాపూర్ ఉపసర్పంచ్ సీతరాజు ,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.