ధర్మారంలో శివరామకృష్ణ భజన మండలి భక్తి పారవశ్యం అద్భుత ప్రదర్శన..

ధర్మారంలో శివరామకృష్ణ భజన మండలి భక్తి పారవశ్యం అద్భుత ప్రదర్శన..

శంకరపట్నం ముద్ర సెప్టెంబర్ 26: శంకరపట్నం మండలం ధర్మారం గ్రామంలో సోమవారం రాత్రి గణపతి సన్నిధిలో శివరామకృష్ణ భజన మండలి నిర్వహించిన భజన కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపారు. మధురమైన భక్తి గానాలు ఆలపిస్తూ జనులను భక్తిలో ముంచెత్తారు. మూడు గంటల పాటు ఈ భజన కార్యక్రమము కొనసాగింది. ఈ కార్యక్రమంలో కురపాటి సత్యనారాయణ,నూనె రవి, తాటికొండ సదానందం,రమణారెడ్డి, మహిపాల్ రెడ్డి,రమేష్, మల్లారెడ్డి,సదానందం, రవి పాల్గొన్నారు. ఇందులో భాగంగా గణపతి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కన్నాపూర్ గ్రామ సర్పంచ్ కాటన్ వెంకటరమణ రెడ్డి, ధర్మారం గ్రామ సర్పంచ్ చుక్కల రవి, మాజీ సర్పంచ్ చింతి రెడ్డి  మహేందర్ రెడ్డి లు హాజరైనారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.