నిరుపేదలకు సామాజిక తెలంగాణ కావాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

నిరుపేదలకు సామాజిక తెలంగాణ కావాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఉన్నొడికే బంగారు తెలంగాణ అని, నిరుపేదలకు సామాజిక తెలంగాణ కావాలని ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్ మండలంలో  కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టో కు అదనంగా కాంగ్రెస్ అమలు చేయబోయే ఎన్నికల ప్రణాళికను ప్రకటించిన సోనియా గాంధీ కాంగ్రెస్ అభయహస్తం 6 గ్యారంటీల కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ప్రారంభించి, కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటు పట్ల చులకన భావంతో మాట్లాడారని, చరిత్రలో సువర్ణ అక్షరాలతో సోనియా గాంధీ పేరు లికించబడితుందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో డీసీసీ అద్యక్షుడు అడ్లురి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ జిల్లా కిసాన్ సెల్ అద్యక్షుడు వాకిటి సత్యం రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు గోపి రాజిరెడ్డి, రవీందర్ రావు, కొమ్ముల రాధా ఆదిరెడ్డి, మారంపల్లి గంగాధర్,రమేష్, అల్లూరి మహేందర్ రెడ్డి, దారం ఆదిరెడ్డి, గుండా మధు,కాటిపెల్లి గంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు సుదీర్, లక్ష్మణ్, కోటవెని రాజేందర్, వేముల మురళి,సుధాకర్ రెడ్డి, బుసనవేని శ్రీనివాస్, వార్డు మెంబర్లు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏలేటి జలందర్ రెడ్డి..కొయ్యడ మహిపాల్, రమేష్, ఆరె శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు గుండా మధు, అజయ్, బండారి మధు, బండారి స్వామి రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.