యువకుడిని కొట్టి చంపారు

యువకుడిని కొట్టి చంపారు

మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పీఎస్ పరిధిలోని కౌకూర్‌ భరత్‌ నగర్‌లో దారుణం జరిగింది. అలీఖాన్ అనే యువకుడిని దుండుగులు కొట్టి చంపారు. మృతుడు గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఏడాది క్రితం పెద్దలను ఎదిరించి అలీఖాన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.