దారుల్లో వాహనాలు.. తప్పని తిప్పలు

దారుల్లో వాహనాలు.. తప్పని తిప్పలు
  • రాకపోకలకు ఇక్కట్లు

భూదాన్ పోచంపల్లి,ముద్ర:-భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ప్రధాన రహదారిని విస్తరించిన అందులో సగం స్థలం వాహనాలు నిలవడానికీ సరిపోతుంది. గతంలో లాగానే రహదారి ఇరుకుగా మారి ప్రయాణికుల రాకపోకలకు  తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా కర్నాటి కాంప్లెక్స్, వైన్స్, టీ పాయింట్ ల వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. రోడ్డు మధ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఇష్టానురాజ్యంగా నిలపడం, ఎటు పడితే అటు రాంగ్ రూట్ లో వెళ్ళడం వల్ల సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు.ప్రధాన రహదారులతో పాటు గల్లీలోనూ వాహనాలు రోడ్లపైనే నిలుపుతున్నడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు తప్పడం లేదు. వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల పెద్ద సమస్యగా మారింది.

దారి అక్రమనకు గురైంది

పట్టణంలోని కర్నాటి కాంప్లెక్స్,వైన్స్,టీ పాయింట్ల ఎదురుగా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలపడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. వాహనాలు రోడ్డు పైనే నిలపడంతో దారి అక్రమనకు గురై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పోలీసులు స్పందించి ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

వాహనాలు నిలిపితే చర్యలు - ఎస్ ఐ భాస్కర్ రెడ్డి, భూదాన్ పోచంపల్లి

భూదాన్ పోచంపల్లి పట్టణంలో రోడ్లపై ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతున్న మాట వాస్తవమే. ప్రధానంగా సాయంత్రం వేళలో టీ పాయింట్, వైన్స్ ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపోద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని హెచ్చరించారు.రోడ్డు మధ్యలో వాహనాలు నిలిపితే చలాన్లు విధించి చర్యలు తీసుకుంటాం.