హరిద్వార్కు ప్రయాణమైన రెజ్లర్లు
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రెజ్లర్లు హరిద్వార్కు ప్రయాణమయ్యారు. తమకు వచ్చిన పతకాలను గంగలో పడేస్తామని వారు ఉదయమే ప్రకటించారు. పతకాలను గంగలో కలిపిన తరువాత ఇండియా గేట్ దగ్గర ఆమరణ దీక్ష చేస్తారు. వీరిని పోలీసులు అడ్డుకునే అవకాశం ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 40 రోజులుగా ఢిల్లీలో రెజర్లు ఆందోళన చేస్తున్నారు.