కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
![కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_640c4b71c64ba.jpg)
ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై శనివారం ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మను ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో దహనం చేశారు. మహిళ అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ని వెంటనే అరెస్టు చేయాలని మండల ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టి ఈడీలను రంగంలోకి దించుతుందని ఆరోపించారు. ఈడీలకు మోడీలకు మేము లొంగేది కాదని రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి దేయంగా ముందుకు పోతున్న మా బి ఆర్ ఎస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, మండల సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి పరుశరాములు గౌడ్, ఎనగందుల అనసూయ నర్సింలు, మండల మైనార్టీ సెల్ మహిళా అధ్యక్షురాలు అప్సర్ ఉన్నిసా, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సీత్యా నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్, మురళి గౌడ్, ఎలుసాని మోహన్, నేవూరి నరసింహారెడ్డి, మాధవ్ ఉదయ్ బి ఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.