బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఐటి కోకన్వీనర్ గా... సందీప్

బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఐటి కోకన్వీనర్ గా... సందీప్

ముద్ర , కుషాయిగూడ: బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఐటీ విభాగం కోకన్వీనర్ గా ఎస్ రావు నగర్ డివిజన్ కమలా నగర్ కు చెందిన సందీప్ పరికిబండ నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ రాజు... మంగళవారం ఆయనకు నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ... సామాజిక మాధ్యమాల వేదికగా బిజెపి పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అలాగే తనకి పదవి ఇచ్చిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో   ఏఎస్ రావు నగర్ డివిజన్ బిజెపి పార్టీ అధ్యక్షుడు రమేష్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు.