కొడ్వటూరులో యువకుడి మృతదేహం లభ్యం

కొడ్వటూరులో యువకుడి మృతదేహం లభ్యం

ముద్ర ప్రతినిధి, జనగామ (బచ్చన్నపేట) : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొడ్వటూరు గ్రామ శివారులో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రెండు మూడు రోజుల కింద గుర్తుతెలియ వ్యక్తులు ఇతడి హత్య చేసి పడేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఇతడి వయసు 40 పైన ఉంటుందని భావిస్తున్నారు. స్థానిక పోలీసులకు సమాచారంతో బచ్చన్నపేట ఎస్సై సతీశ్‌కుమార్‌‌ నేతృత్వంలో పోలీసులు మధ్యాహ్నం ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి ఒంటిపై ఎరుపు రంగు గీతల చొక్క, ఆకుపచ్చ రంగు ప్యాంట్‌ ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.