అన్ని కమర్షియల్ అంశాలతో "సర్కిల్" ఆకట్టుకుంటుంది 

అన్ని కమర్షియల్ అంశాలతో "సర్కిల్" ఆకట్టుకుంటుంది 

దర్శకుడు నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా "సర్కిల్". ఈ చిత్రంలో సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా  ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త  థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 7న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలో నటించిన తమ అనుభవాలను ఇంటర్వ్యూలో తెలిపారు నాయికలు అర్షిణ్ మెహతా, రిచా పనై. అర్షిణ్ మెహతా మాట్లాడుతూ... - సల్మాన్ హీరోగా నటించిన భజ్రంగీ భాయిజాన్ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రతో నా కెరీర్ మొదలుపెట్టాను. సర్కిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాను. ఇప్పటిదాకా ఇక్కడి చిత్రాల్లో నటించిన అనుభవం లేదు. నీలకంఠ గారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. ఆయన చిత్రంలో అవకాశం రావడం సంతోషంగా ఉంది. నీలకంఠ గారు క్యారెక్టర్, నటన విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ఈ సినిమాతో నటిగా చాలా విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఈ చిత్రంలో ప్రిన్సెస్ పాత్ర నాది. హీరో ఫొటోగ్రాఫర్. వీరి మధ్య జరిగే ప్రేమ కథ ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగు భాష రాదు కాబట్టి సెట్ లో ఇబ్బందిపడేదాన్ని. కానీ డైరెక్టర్ తో సహా టీమ్ చాలా సపోర్ట్ చేసి నేను బాగా నటించేలా చూసుకున్నారు.