యువతి అదృశ్యం - మిస్సింగ్ కేసు నమోదు
![యువతి అదృశ్యం - మిస్సింగ్ కేసు నమోదు](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_649942fbca4a5.jpg)
ముద్ర,ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన గంగసారం భవ్య 21 కనపడుటలేదని తండ్రి బిక్షపతి ఎల్లారెడ్డిపేట పోలీసులను సోమవారం ఆశ్రయించాడు. ఎస్సై ప్రేమ్ దీపు వివరాల ప్రకారం భవ్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుకుంటుందని ఆమె ఆదివారం తన స్నేహితుల దగ్గరికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన భవ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రిబిక్షపతి తల్లి చంద్రకళ కలిసి స్నేహితుల ఇండ్లలో అదేవిధంగా బంధువుల ఇండ్లలో ఆరా తీయగా భవ్య రాలేదని తెలుపడంతో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు సోమవారం వచ్చి ఫిర్యాదు చేశారు. వుమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమ్ దీప్ తెలిపారు.