అరగంట పవర్ కట్.. డీఈ సస్పెండ్
ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో ఈమధ్య కరెంట్ కోతలు ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. అరగంట సేపు కరెంట్ నిలిపివేసినందుకు హబ్సిగూడ పరిధిలోని కీసర డివిజనల్ ఇంజినీర్ ఎల్. భాస్కర్రావును.. తెలంగాణ స్టేట్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. అలాగే నాగారం ఆపరేషన్ అడిషనల్ అసిస్టెంట్ ఇంజినీర్ పై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అత్యవసర పరిస్థితిల్లో లైన్ క్లియరెన్స్ తీసుకోవాలన్నా.. సర్కిల్ ఎస్ఈ ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు.అయితే డీఈ భాస్కర్ రావు 33 కేవీ అమ్ముగూడ ఫీడర్పై పర్మిషన్ లేకుండానే ఎల్సీ ఇచ్చారు. దీంతో శనివారం ఉదయం 10.05 AM – 10.35 PM వరకు కరెంట్ సరఫరా ఆగిపోయింది. ఆ సమయంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కరెంట్ కోతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతుండగా పవర్ కట్. pic.twitter.com/T4ouPMYKEL
— Telugu Scribe (@TeluguScribe) April 27, 2024