శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు..

శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాలతో అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా  తిరుగుతూ,అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న యువతే లక్ష్యంగా 'ఆపరేషన్ చబుత్రా' పేరుతో జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లో డిఎస్పీ ప్రకాష్, సిఐ కిషోర్ అధ్వర్యంలో పోలీసులు ముమ్మర త‌నిఖీలు నిర్వహించారు. యవకులు అర్ధరాత్రి వేళల్లో  ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై గుంపులుగా జులాయిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, మద్యం సేవించి రోడ్లపై ద్విచక్ర వాహనాలతో రాష్ డ్రైవింగ్, హారన్లు కొడుతూ, ప్రధాన కూడళ్ల లలో  వాహనాలను నిలిపి గుంపులుగా, అనుమానస్పదంగా  తిరుగుతున్న 48 మంది యువకులను అదుపులోకి తీసుకోని వారి బైక్ లను పోలీసులు  సీజ్ చేశారు.  వారి తల్లితండ్రుల ను పిలిపించి పోలీస్ లు  కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ ప్రకాష్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి యువత తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉన్నదని, తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో తరచుగా ఆపరేషన్ చబుత్రా  స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తామని అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవరైనా యువకులు రోడ్లపై అనవసరంగా గుంపులుగా  సంచరిస్తూ సామాన్య  ప్రజాలకు,మహిళలను ఇబ్బందుల కు గురి చేస్తే   వారిపై టౌన్ న్యూసెన్స్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు  చేస్తామన్నారు.యువత చట్టవ్యతిరేకమైన పనుల్లో పాల్గొంటే వారి యొక్క మంచి భవిష్యత్ ను కోల్పోతారు అని సూచించారు.