యువకులకు క్రీడా సామాగ్రి అందజేత

యువకులకు క్రీడా సామాగ్రి అందజేత

కేసముద్రం, ముద్ర: బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన యువకులకు క్రికెట్, వాలీబాల్ క్రీడా కిట్లను అందజేశారు. యువకులు క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని, దేశభక్తి కలిగి ఉండాలని, డాక్టర్ అంబేద్కర్, స్వామి వివేకానంద చూపిన మార్గాలను అనుసరించి, అభివృద్ధిలోకి రావాలని కోరారు.