మెదక్ పట్టణంలో బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ ఇంటింటి ప్రచారం
ముద్ర ప్రతినిధి, మెదక్: బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే యం. పద్మా దేవేందర్ రెడ్డి శుక్రవారం మెదక్ పట్టణంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం వెంకటేశ్వర టెంపు నుండి ప్రచారం ప్రారంభించారు. అనంతరం 20,22,23,24,25లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.