రామయంపేట రెవెన్యూ డివిజనన్ ప్రకటించాలి అసెంబ్లీలో ప్రస్తావించిన మెదక్ ఎమ్మెల్యే పద్మ

రామయంపేట రెవెన్యూ డివిజనన్ ప్రకటించాలి అసెంబ్లీలో ప్రస్తావించిన మెదక్ ఎమ్మెల్యే పద్మ

ముద్ర ప్రతినిధి, మెదక్: రామయంపేటను కొత్త రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలంటూ అసెంబ్లీలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్ కేంద్రాలు, కొత్త మండల కేంద్రాలు, నూతన గ్రామపంచాయతీలతోపాటు గిరిజన తండాలను కూడా పంచాయతీలుగా ఏర్పాటు చేసే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రామాయంపేట రెవెన్యూ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.