ఫోటోగ్రఫీ వృత్తి నైపుణ్య శిక్షణ శిబిరం

ఫోటోగ్రఫీ వృత్తి నైపుణ్య శిక్షణ శిబిరం
  • గోడపత్రిక అవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఈ నెల 19న నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా వృత్తి నైపుణ్య శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. గోడ పత్రికను కలెక్టర్ రాజర్షి షా బుధవారం ఆవిష్కరించారు.వృత్తి నైపుణ్య శిక్షణ శిబిరంలో రాష్ట్ర అధ్యక్షులు షేక్ హుస్సేన్, దిశెట్టి రాంబాబు, కెనాన్ మెంటర్ ప్రసాద్, లీఫ్ స్టూడియో ఫోటోగ్రఫీలో వస్తున్న మార్పులను, కొత్త టెక్నాలజీలో ఉన్న మెలకువలను వివరిస్తారు.  వర్క్ షాప్ లో జిల్లాలోని అన్ని మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా అధ్యక్షులు బిట్ల నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శి గిర్ని ప్రభుగౌడ్, జిల్లా కోశాధికారి పొట్లచెరువు నాగరాజు కోరారు. ఈ కార్యక్రమంలో బసవరాజు, విగ్నేష్, బేతయ్య, గిరి, శ్రీకాంత్, రంజిత్ కుమార్, సుమన్ ఉన్నారు.