ఎస్టియు యూనియన్ అధ్యక్షుడిగా ఈదులపల్లి నరసింహారావు
ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడిగా మంథని పట్టణానికి చెందిన ఈదులపల్లి నరసింహారావు ను, ప్రధాన కార్యదర్శి ములకల్ల రాజశేఖర్ లు మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు. ఎస్ టి యు ఉపాధ్యక్షులుగా శేషాద్రి, శైలజ, దివాకర్ , శ్రీకాంత్, కార్యదర్శులుగా రాము, లక్ష్మణ్, ప్రసన్న, శైలజ కుమారి, సుప్రియ, నగేష్ కుమార్, ఆర్థిక కమిటీ కార్యదర్శిగా రాజేష్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా పరమేష్ శ్యామల కనకయ్య శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యల కోసం త్రికరణ శుద్ధిగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు.