తెలంగాణ అమర వీరులకు ఘననివాళులు అర్పించిన బర్లగూడెం పంచాయతీ ప్రజలు..

తెలంగాణ అమర వీరులకు ఘననివాళులు అర్పించిన బర్లగూడెం పంచాయతీ ప్రజలు..

ముద్ర,వెంకటాపురం(నూ): గురువారం దశాబ్ది ఉత్సవాళ్ళో భాగంగా ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, బర్లగూడెం గ్రామపంచాయతీ లో తెలంగాణ అమర వీరుల స్మారక ఉత్సవాలు సర్పంచ్ నర్సింహా మూర్తి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, సకల జనులు, సబండ వర్గాలు పాల్గొన్నారు అని ప్రత్యేక అధికారి పుష్పావతి, కార్యదర్శి మౌనిక అన్నారు. అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ రెండు నిముషాల పాటు మౌనం పాటించుట జరిగింది. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ ఇర్ప రవి,వార్డ్ మెంబెర్స్ అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ ప్రజలు పాల్గొన్నారు.