సిద్దిపేటలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ఫ్లెక్సీ  దహనం

సిద్దిపేటలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ఫ్లెక్సీ  దహనం
  • రైతులపై విషం చిమ్మడం రేవంత్ రెడ్డికి తగదు
  • భారత రాష్ట్ర సమితి నేతల హెచ్చరిక

ముద్ర ప్రతినిధి: సిద్ధిపేట:రైతు కుటుంబంలో పుట్టి, రైతులకు వ్యతిరేకంగా మాట్లాడడం కాంగ్రెస్ రాష్ట్ర అధినేత రేవంత్ రెడ్డికి తగదని భారత రాష్ట్ర సమితి సిద్దిపేట జిల్లా నేతలు హితవు చెప్పారు.ఉచిత విద్యుత్ వద్దంటూ అనుచిత సలహాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డ్ కమాన్ వద్ద మంగళవారం నాడు దహనం చేశారు.

రైతు సంక్షేమం కోసం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను విమర్శించడానికి నిరసిస్తూ హౌసింగ్ బోర్డ్ కమాన్ వద్ద భారత రాష్ట్ర సమితి జిల్లా నేతలు కొద్దిసేపు సిద్ధిపేట- హైదరాబాద్ రహదారిపై బైఠాయించారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ  చెప్పు లతో  కొడుతూ  తగలబెట్టారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు జిల్లా అధ్యక్షులు వంగ నాగిరెడ్డి,పట్టణ పార్టీ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ కడవెరుగు రాజనర్సు  సాయిరాం, పట్టణ కౌన్సిలర్లు యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు నిమ్మ రజనీకాంత్ రెడ్డి, విద్యార్థి విభాగం నేతలు బారాస మహిళా విభాగం నేతలు అనితారెడ్డి,అర్చన రెడ్డి, నిర్మల,సువర్ణ తదితరులు పాల్గొన్నారు.