శ్రీనివాస నగర్ వినాయకుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే - పద్మావతి రెడ్డి
![శ్రీనివాస నగర్ వినాయకుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే - పద్మావతి రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_650e6f8431c05.jpg)
ముద్ర ప్రతినిధి , కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం 30వార్డు శ్రీనివాస నగర్ లో మదర్ తెరిసా సేవ యూత్ ఆధ్వర్యంలో 25వ సారి ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజు మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పూజా కార్యక్రమాలలో పాల్గొని శాంభవి పీఠాధిపతి విష్ణుభట్ల హరి శర్మ ఆధ్వర్యంలో యూత్ సభ్యులు సన్మానించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమం లో యూత్ సభ్యులు బాలెబాయిన శ్రీను, సుంకు శ్రీను, సలిగంటి మురళి, చలిగంటి ప్రసాద్, భాగ్య రాజ్, నర్సింహారావు, సత్తార్, పాపారావు, మధు, చలం ,రాజేష్ , ఉపేందర్,నాగరాజు తదతరులు పాల్గోన్నారు.