పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచిత భోజనం

పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచిత భోజనం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల లోని కూరగాయల మార్కెట్ రోడ్ లో జిల్లా గ్రంధాలయంలోని ప్రత్యేక గదిలో పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న  యువతి,  యువకులకు మధ్యాహ్న భోజనం రేటు చేశారు. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ కార్యదర్శి కొక్కిరాల సురేఖ మధ్యాహ్న భోజనం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి మంచిర్యాల గ్రంధాలయం లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు చదివేందుకు వస్తున్నారని సురేఖ తెలిపారు.  ఉదయం గ్రంధాలయం కు చేరుకుని చదుకున్న అనంతరం  సాయంత్రం ఇండ్లకు వెళ్తారని మధ్యలో భోజనం చేయడం లేదని తెలియడంతో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచనల మేరకు మా వంతు సాయంగా భోజనాలు ఏర్పాటు చేశామని చెప్పారు. గురువారం నుంచి మధ్యాహ్నం భోజనం సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు. మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం వల్ల అభ్యర్థుల చదువు సజావుగా సాగుతుందని ఆమె అన్నారు. భోజనాలు ఏర్పాటు చేయడం పట్ల పోటీ పరీక్షల అభ్యర్థులు సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు.