ఐటీసీ ద్వారా సిద్ధిపేట మున్సిపాలిటీ కోటి రూపాయల నిధులు
- మంత్రి చేతుల మీదుగా 50 లక్షలు మున్సిపాలిటీకి అందజేసిన ఐటీసీ అధికారులు
ముద్ర ప్రతినిధి:సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలో హరితహరం నిర్వహణకు అవసరమైన నీటి ట్యాంకర్లు,హరితహర సిబ్బందికి జీతాలు, ప్రశాంత్ నగర్ వైకుంఠధామం సుందరీకరణకు ఐటీసీ సంస్థ సిఎస్ఆర్ ద్వారా సిద్దిపేట మున్సిపాలిటీకి ఒక కోటి రూపాయలు మంజూరు చేసింది. అందులో భాగంగా 50 లక్షల రూపాయలను ఐటీసీ వావ్ హెడ్ షిబ్ శంకర్,ఐటీసీవావ్ చీఫ్ మేనేజర్ఉమకంత్ లు బుధవారం రాత్రి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్,చైర్ పర్సన్ కడవెర్గు మంజుల రాజనర్సు కు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ రంజిత్, ఐటీసీ వావ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.