ముషీరాబాద్ నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ముషీరాబాద్ నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
  • ఆదర్శవంతంగా శ్రీకృష్ణ కాలనీ పార్కును తీర్చిదిద్దుతాం-ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్

ముద్ర, ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గం లోని పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే ముఠాగోపాల్ తెలిపారు. భోలక్ పూర్ డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ కాలనీ వాసుల ఆకాంక్షలకు అనుగుణంగా పార్కును నియోజకవర్గానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. శ్రీకృష్ణ కాలనీ పార్కు స్థలంలో 15 లక్షల రూపాయలతో చేపట్టనున్న పనులను గురువారం స్థానిక కార్పొరేటర్ గౌసుద్దీన్ తో కలిసి ఎమ్మెల్యే ముఠాగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ శ్రీకృష్ణ కాలనీవాసులు కలిసికట్టుగా పోరాటం చేసి  కబ్జాకు గురికాకుండా పార్కు స్థలాన్ని కాపాడుకున్నారని తెలిపారు. కాలనీ వాసుల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ పార్కును అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మంజూరైన నిధులతో పార్కులో వాక్పాత్, ఇనుపకంచ, ఫుట్ పాత్, జిమ్ పరికరాలను ఏర్పాటు చేయనున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు డిఈ సన్నీ, ఏఈ సుభాష్, వర్క్ ఇన్స్పెక్టర్ దాసు, శ్రీకృష్ణ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యాదగిరి, ఉపాధ్యక్షులు మహమ్మద్ అలీ, లయిక్, బాలకృష్ణ, అబ్దుల్ అజీజ్ పాషా, అబిదాలీ, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాసరావు, నాయకులు ముఠా జైసింహ, బింగి నవీన్, రహీం, శంకర్, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.బిలాల్ మసీదును సందర్శించిన ఎమ్మెల్యే:భోలక్ పూర్ డివిజన్ లోని బిలాల్ మసీద్ లో డ్రైనేజ్ నీరు చేరి ఇబ్బందులకు గురౌతున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్ గురువారం అధికారులతో కలిసి మసీదును సందర్శించారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.