పట్టణ ప్రగతి పనులను సకాలంలో పూర్తి చేయాలి

పట్టణ ప్రగతి పనులను సకాలంలో పూర్తి చేయాలి
  • జిల్లా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ హేమంత్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-పట్టణ అభివృద్ధిలో భాగంగా పట్టణ ప్రగతి పనులనుసకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పాటిల్ హేమంత కేశవ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోనని సమావేశ మందిరం నందు సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో పారిశుధ్యం పై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారొ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి కావున నిరు నిల్వ ప్రాంతాలను గుర్తించి శుభ్రతకుతకు చర్యలు తీసుకోవాలని అతను ఆదనపు కలెక్టర్ తెలిపారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా రానున్న వర్షాకాలం ద్రుష్ట్య సీజనల్ వ్యాధులు అరికట్టుటకు పరిసరాల పరిశుభ్రత,  చెత్త సేకరణ సజావుగా జరగాలన్నారు. తెలంగాణకు హరితహారం లో భాగంగా 10 లక్షల మొక్కలు ఈనెల చివరి కల్లా 100% నాటాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీల వారిగా తమకు కేటాయించిన టార్గెట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్రాగునీటి సరఫరా లీకేజీలు లేకుండా వాటర్ పొల్యూషన్ కాకుండా చూడాలన్నారు. ఆసిపన్నులను సకాలంలో సేకరించాలని కలెక్టర్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కులవృత్తులపైనే ఆధారపడిన వారి ఆర్థిక అభివృద్ధి కోసం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడంకోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలనగావించి, అర్హుల జాబితా సిద్ధం చేయాలన్నారు. ఆసరా పెన్షన్ల పంపిణీ సకాలంలో జరగాలని పెన్షన్ దారులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. మున్సిపాలిటీలలోని సిబ్బంది సకాలంలో విధులకు  హాజరు కావడం లేదని అట్టివారి సమాచారం మున్సిపల్ కమిషనర్లు ఇకనుంచి తెలియజేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. విధుల పట్ల ఏ ఒక్కరు నిర్లక్ష్యం వహించొద్దని అధర్మ కలెక్టర్ సూచించారు.  సమావేశాలలో సంబంధిత సెక్షన్ అధికారులు మాత్రమే సమాధానాలు చెప్పాలని అదనపు కలెక్టర్ తెలిపారు. కొన్ని మున్సిపాలిటీలలో  సమస్యలు ఉత్పన్నమగు తున్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు అదనపు కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షన్ అన్ని గ్రూపులలో అప్డేట్ చేయాలని తెలిపారు. మోడ్రన్ మాకనైజ్డ్ ధోబి గాడ్ల నిర్మాణాలు పనులు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి కోదాడ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి హుజూర్నగర్ వెంకటేశ్వర్లు తిరుమలగిరి దండు శ్రీను పిడి మెప్మా రమేష్ నాయక్ మున్సిపల్ జీకే డి ప్రసాద్ అన్ని సెక్షన్ల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.