కల్నల్ సంతోష్ బాబు త్యాగం చిరస్మరణీయం

కల్నల్ సంతోష్ బాబు త్యాగం చిరస్మరణీయం

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట : దివంగత కల్నల్ సంతోష్ బాబు త్యాగం చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచి పోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కల్నల్ సంతోష్ బాబు మూడో వర్ధంతిని పురస్కరించుకుని సూర్యాపేట పట్టణంలోనీ ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం త్యాగం చేసిన దివంగత సంతోష్ బాబు వర్తమానానికి స్ఫూర్తి దాయాకంగా నిలిచారన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.