సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
![సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645b9d22f10fe.jpg)
కోదాడ, ముద్ర;నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి నిధులు 5 లక్షల రూపాయలతో కోదాడ పట్టణంలోని స్థానిక 34 వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కోదాడ మాజీ సర్పంచ్ పారా సీతయ్య, స్థానిక వార్డు కౌన్సిలర్ గంధం యాదగిరి లు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ ఉత్తమ్ నిధులతో పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గంధం యాదగిరి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆవు దొడ్డి ధనమూర్తి, కుడుముల లక్ష్మీనారాయణ,కాంపాటి శ్రీను,కాంపాటి. పుల్లయ్య, కర్ల ఆనంద్ బాబు,ఏర్పుల యాకూబ్, కాంపాటి రమేష్, సైదులు, వంశీ,రాము, పిడమర్తి మధు తదితరులు పాల్గొన్నారు.