హాఫ్ మారథాన్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలో ఆగస్టు6 న జరిగే హాఫ్ మారథాన్ వాల్ పోస్టర్ ను సిద్దిపేట ఏసిపి దేవారెడ్డి ఆవిష్కరించారు. సిద్దిపేటలోని ఏసీబీ ఆఫీసులో బుధవారం నాడు ఈ పోస్టర్ను ఆవిష్కరించారుఈ సందర్భంగా ఏసిపి చల్ల దేవా రెడ్డి మాట్లాడుతూ మంత్రి తన్నీరు హరీష్ రావు చొరవతో పోలీస్ కమిషనర్ సూచనల మేరకుఆరోగ్య సిద్దిపేటలో భాగంగా సిద్దిపేట పట్టణం రంగనాయక సాగర్ ప్రాజెక్టు పై హాఫ్ మారథాన్ 5కె, 10కె, 21కె నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల యువతి యువకులు ఆన్లైన్ లింక్ ద్వారా పేరు రిజిస్టర్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంఒక పండుగ వాతావరణం లో నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ కిరణ్ రెడ్డి, రాజగోపాలపేట ఎస్ఐ రాజు గౌడ్, బెజ్జంకి ఎస్హెచ్ఓ ప్రవీణ్ రాజ్, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కత్తుల బాపురెడ్డి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.