ఎలక్ట్రిక్ కార్లపై ఆఫర్ల వర్షం .. భారీ డిస్కౌంట్
![ఎలక్ట్రిక్ కార్లపై ఆఫర్ల వర్షం .. భారీ డిస్కౌంట్](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64d9cfbbdd8a5.jpg)
ముంబై : మీరు కొత్త కారు కోసం చూస్తున్నారా? అది కూడా ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ మోడళ్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంచాయి. అందువల్ల మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొ ప్లానింగ్లో ఉంటే ఈ డీల్ వెంటనే సొంతం చేసుకోవచ్చు. హ్యుందాయ్ కార్ల విషయానికి వస్తే.. కంపెనీ కోన ఈవీ పేరుతో ఒక ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో అందుబాటులో ఉంచింది. ఈ కారుపై ఏకంగా రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ఈ నెల చివరి వరకే అందుబాటులో ఉంటుంది. కంపెనీకి చెందిన తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే. ఇందులో 39.2 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 450 కి.మి వరకు వెళ్లొచ్చని కంపెనీ పేర్కొంటోంది. అలాగే మహీంద్రా ఎక్స్యూవీ 400 కారుపై అయితే రూ. 1.25 లక్షల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మహీంద్రా కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ కారు ఎక్స్యూవీ 400 కావడం గమనార్హం. ఈ కారుపైనే అధిక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ కారు ఒక్కసారి చార్జ్ చేస్తే 456 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. అలాగే టాటా మోటార్స్ ఈవీ కార్లపై కూడా డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. టిగోర్ ఈవీపై ఏకంగా రూ.80 వేల వరకు, నెక్సన్ ఈవీ కారుపై రూ. 56 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇంకా నెక్సన్ ఈవీ మ్యాక్స్ కారుపై అయితే రూ. 61 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.ఇక పోతే పైన ఇచ్చిన ఆఫర్లు అనేవి ప్రాంతం, డీలర్ షిప్, మోడల్, వేరియంట్ ఆధారంగా మారుతూ ఉంటాయి. అందు వల్ల మీరు కారు కొనే ప్లానింగ్లో ఉంటే దగ్గరిలోని షోరూమ్కు వెళ్లి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.