హుజూర్ నగర్ లో రెండు ఇళ్లల్లో చోరీ...!
![హుజూర్ నగర్ లో రెండు ఇళ్లల్లో చోరీ...!](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64d9d02caaf2a.jpg)
హుజూర్ నగర్ టౌన్ ముద్ర: హుజూర్ నగర్ లో ,శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.తాళం వేసి ఉన్న ఇళ్లలోకి ప్రవేశించి,బంగారం వెండి,నగదు తో ఊడయించారు.కేసు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీకి ,చెందిన బెల్లంకొండ నాగేశ్వరరావు, పాలవరపు వెంకట నరసమ్మ లు ,తాళం వేసి ఊరు వెళ్ళగా.. తాళాలు ,పగలగొట్టి దుండగులు ఇంట్లో ప్రవేశించి బెల్లంకొండ నాగేశ్వరరావు ఇంట్లో సుమారు 15 వేల రూపాయల నగదు, పాలవరపు వెంకట నరసమ్మ ఇంట్లో వెండి వస్తువులు, 1తులం బంగారపు ఉంగరం, 3000 రూపాయల నగదును , చోరీ చేసినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరికృష్ణ తెలిపారు.