దంచి కొట్టిన ఎండ..

దంచి కొట్టిన ఎండ..

కేసముద్రంలో 46 డిగ్రీలు నమోదు
కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో శనివారం ఎండ దంచి కొట్టింది. 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే కేసముద్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మూడు రోజులపాటు ఎండ తీవ్రత ఇలాగే అత్యధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఉదయం 11 గంటల తర్వాత జనం బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. ఎండ దెబ్బ తగలకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.