పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయిన అభ్యర్థులకు సన్మానం

పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయిన అభ్యర్థులకు సన్మానం

సిరిసిల్ల టౌన్, ముద్ర: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తీసుకుని పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయిన 8 మంది అభ్యర్థులను డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. అభ్యర్థులు తమ విజయానికి సహకరించినందుకు బీసీ స్టడీ సర్కిల్ కు, మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాఘవేందర్, వార్డ్ కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్, సిబ్బంది హరీశ్, సురేశ్, దివ్య, కిరణ్మయి, మురళి, ప్రసాద్, అనిత లు పాల్గొన్నారు.