ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన సంజీవ్ సార్
![ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన సంజీవ్ సార్](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64f5a3f185466.jpg)
- డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా అవార్డు అందజేత
ముద్ర, ఎల్లారెడ్డిపేట:జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక అయిన దొడ్ల సంజీవ్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన దొడ్ల సంజీవ్ కు ఉత్తమ జిల్లా ఉపాధ్యాయునిగా ఎంపిక అయినట్లు సోమవారం జిల్లా డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి సంవత్సరం డాక్టరు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి అవార్డులను అందజేస్తుంది. అందులో భాగంగా రేపు కలెక్టర్ సమక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేయనున్నారు. మండలంలోని రాచర్ల గొల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం బోధిస్తున్న దొడ్ల సంజీవ్ ఎంపిక కావడం పట్ల మండల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సంజీవ్ తండ్రి దొడ్ల కృష్ణయ్య ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పదవి విరమణ పొందాడు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్యను బోధించి విద్యావంతులను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.