మోడల్ లే ఔట్ ప్లాట్లని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రానివారికి కేటాయించాలి 

మోడల్ లే ఔట్ ప్లాట్లని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రానివారికి కేటాయించాలి 
  • బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి 

సిరిసిల్ల టౌన్, ముద్ర: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోడల్ లే ఔట్ పేరుతో సిరిసిల్ల మున్సిపల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి ఆరోపించారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ మున్సిపల్ ప్లాటింగ్ చేసిన స్థలం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రానివారికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు ప్రశ్నించే అవకాశం లేకుండా సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ ఇచ్చి రెండు రోజులు మాత్రమే సమయం ఇవ్వడం సరైన విధానం కాదని అన్నారు. కేటీఆర్ స్థానికుడు కాదని సిరిసిల్లలోని భూములు అమ్మే హక్కు ఆయనకు లేదని విమర్శించారు. జిల్లాలో ఇసుకను దోచుకు పోయారని, ఇప్పుడు ప్రభుత్వం భూములు అమ్ముకుంటుందని అన్నారు. అధికారంలోకి రాకముందు బిఆర్ఎస్ భూములు అమ్మడాన్ని వ్యతిరేకించిందని అదే అధికారంలోకి రాగానే మంత్రి కేటీఆర్ ప్రభుత్వ భూములు అమ్ముతున్నాడని ఆయన పేర్కొన్నారు.