ఎల్లారెడ్డిపేటలో  పట్టపగలు దొంగతనం

ఎల్లారెడ్డిపేటలో  పట్టపగలు దొంగతనం

మూడు తులాల బంగారం, 15 తులాల పట్ట గొలుసులు,40 వేల నగదు అపహరణ

ముద్ర,ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ముద్ర కోల నరేష్ ఇంట్లో శనివారం పట్టపగలు  గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుడు రమేష్ కథనం ప్రకారం  ఇంటికి,గాజుల దుకాణానికి  గడియ పెట్టి దుబాయిలో మృతిచెందిన నవీన్ శివయాత్రలో పాల్గొని వెంటనే తిరిగి ఇంటికి  వెళ్లగా ఇంటికి పెట్టిన గడియను  తీసి ఇంట్లో ఉన్న  బీరువాను  పగులగొట్టి అదేవిధంగా దుకాణంలో ఉన్న కౌంటర్ ఓపెన్ చేసి  40 వేల నగదు, ఐదు తులాల బంగారం, 15 తులాల పట్ట గొలుసులు దొంగలించబడ్డాయని  ముద్రకోల నరేష్ ఆవేదన వ్యక్తం చేసాడు. గతవారం  ఎల్లారెడ్డిపేట కేడీసీసీ బ్యాంకు దొంగతనానికి పాల్పడిన సంఘటన మరువకముందే మండల కేంద్రంలో పట్టపగలు దొంగతనాలకు పాల్పడుతుండడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.