ఆర్పీల కష్టాలను గుర్తించిన మహనీయుడు సీఎం కేసీఆర్ - ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
![ఆర్పీల కష్టాలను గుర్తించిన మహనీయుడు సీఎం కేసీఆర్ - ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_6515474348447.jpg)
హుజూర్ నగర్ టౌన్ ముద్ర: ఆర్పీల కష్టాలను గుర్తించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆర్పి లకు వేతనం పెంపుపట్ల గురువారం పట్టణంలోని ఇందిరా చౌక్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆర్పీలకు వేతనం పెంచి వారిపట్ల తన అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్,ఆర్పీలు పాల్గొన్నారు.